చెన్నై : చదువు కోసం భారత్కు వచ్చి ఆపై గంజాయి సరఫరా చేపట్టిన రువాండా జాతీయుడిని (32)ని తమిళనాడులోని కోయంబత్తూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని ఇషిమ్వో స్టెబిన్స్గా గుర్తించారు. నిందితుడు శరవణంపట్టి-కీరనాధం రోడ్డు వద్ద గంజాయితో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. కీరనాధంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్న స్టెబిన్స్ కొవిలపాళెంలో యువతకు గంజాయిని చేరవేస్తున్నాడని పోలీసులు తెలిపారు. వాట్సాప్ ద్వారా యువతను సంప్రదిస్తూ వారికి మత్తుపదార్థాలు విక్రయిస్తున్నాడని చెప్పారు.
నిందితుడి నుంచి గంజాయితో పాటు ఓ బైక్, రెండు సెల్ఫోన్లు, రూ 1300 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి వీసా గడువు జులైలో ముగియగా భారత్లో అక్రమంగా నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.