జోగులాంబ గద్వాల : కోడి పందేలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గద్వాల మండలం అనంతపూర్ గ్రామ శివారులో అమిన్ కౌంట్రీ బర్డ్ ఫామ్ లో కోళ్ల పందేల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, గద్వాల్ రూరల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
కోడి పందేలు ఆడుతున్న 11మంది, నిర్వాహకుడు కుర్వ అమిర్ను అరెస్ట్ చేవారు. వారి వద్ద నుంచి 3 కోళ్లు, 10 మొబైల్ ఫోన్లు,17630 రూపాయల నగదు,12 కత్తులు స్వాధీనం చేసుకొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.