రాంచీ : బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన బెల్లీ డ్యాన్సింగ్ కాస్ట్యూమ్ను ఆదివాసీగా ఆమె వ్యాఖ్యానించడంతో రాంచీ ఎస్టీ, ఎస్సీ పోలీస్ స్టేషన్లో పిర్యాదు నమోదైంది. రాఖీ తన కాస్ట్యూమ్ను ట్రైబల్, ఆదివాసీగా అభివర్ణించిన వీడియో వైరల్ కావడంతో జార్ఖండ్ కేంద్రీయ సర్న సమితి ఆమెపై కేసు నమోదు చేసింది.
రాఖీ సావంత్ వైరల్ వీడియోపై కేంద్రీయ సర్న సమితి మండిపడుతోంది. ఈ వీడియోలో రాఖీ తన లుక్ను గిరిజన, ఆదివాసీగా చెప్పుకుంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో వైరల్ భయానీ షేర్ చేశారు. రాఖీ సావంత్పై కేసు నమోదు చేసిన కేంద్రీయ సర్న సమితి నటి తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.