భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఓ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ను ఇండోర్ పోలీసులు రట్టు చేశారు. ఇండోర్లోని బన్గంగ ప్రాంతంలోని హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రాజ్పుటానా హోటల్పై క్రైం బ్రాంచ్ పోలీసులు దాడి చేశారు. దాడుల్లో హోటల్ ప్రాంగణంలో నిర్మించిన ప్రత్యేక గదుల్లో ఎనిమిది మంది పురుషులు, ఏడుగురు మహిళలు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
సెక్స్ వర్కర్లతో హోటల్ యజమాని ఒప్పందంలో భాగంగా ఈ చీకటి దందా సాగుతున్నట్టు గుర్తించారు. హోటల్ యజమాని సెక్స్ వర్కర్లు, విటులను తమ గదుల్లోకి అనుమతించి డబ్బు దండుకుంటున్నాడు. హోటల్ నుంచి రూ 25,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హోటల్ యజమాని సహా పట్టుబడిన వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ ధర్మేంద్ర సింగ్ బదోరియా తెలిపారు. ఈ హోటల్లో గత కొంత కాలంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతన్నట్టు తమ దృష్టికి రావడంతో దాడులు చేపట్టామని చెప్పారు.