నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా యూనిఫాంలో ఉన్న పోలీసుపై చెయ్యి చేసుకున్నాడతను. ఆ పోలీసు అధికారి బెదిరిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. లక్నోలో తాను మైనారిటీ కమిషన్ నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగిందని వినోద్ కుమార్ చెప్పారు.
ఆయన పిలిభిత్ కొత్వాలీ ఏరియాలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తను కారులో తిరిగి వస్తుండగా నిరాలనగర్ వద్ద ఈ ఘటన జరిగినట్లు వినోద్ తెలియజేశారు. సడెన్గా ఒక బైక్ అడ్డంగా వచ్చిందని, బైక్పై వ్యక్తిని ఢీకొట్టకుండా తప్పించేందుకు తన వాహనాన్ని పక్కకు తిప్పానని ఆయన వివరించారు.
ఆ సమయంలోనే రోడ్డు పక్కన, ఒక హోటల్ ఎదురుగా నోపార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి ఉన్న ఒక కారును తన కారు ఢీకొట్టిందని చెప్పారు. దీంతో ఆ హోటల్లో నుంచి ఐదుగురు వ్యక్తులు బయటకు వచ్చి తనను చుట్టుముట్టారని, తాగిన మైకంలో తనపై చెయ్యి చేసుకున్నారని తెలిపారు. తన వద్ద ఉన్న విలువైన వస్తువులు కూడా తీసుకున్నారని వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో నిందితుల్లో ఒకడైన ఆశిష్ శుక్లా అనే వ్యక్తి.. వినోద్పై చెయ్యిచేసుకోవడం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో వైరల్ అవడంతో శుక్లాతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.