తిరువనంతపురం : లైంగిక కోరికలు తీర్చుకునేందుకు జీవిత భాగస్వాములను మార్చుకుంటున్న సెక్స్ రాకెట్కు సంబంధించి కేరళ పోలీసులు ఆదివారం సాయంత్రం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్లో దాదాపు 1000 జంటలు పాలుపంచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరో వ్యక్తితో లైంగిక సంబంధం ఏర్పరచుకోవాలని భర్త ఒత్తిడి చేస్తున్నాడని బాధిత మహిళ కరుకచల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ బయటపడింది.
గతంలో కయంకులం ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగుచేశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా రాష్ట్రవ్యాప్తంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ను వాడుకుని ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. తొలుత వీరు టెలిగ్రాం, మెసెంజర్ గ్రూప్స్ ద్వారా కలుసుకున్నట్టు వెల్లడైందని, ఫిర్యాదుదారి భర్తను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
ఈ చీకటి వ్యవహారం వెనుక భారీ ముఠా ఉందని, ఈ కేసుకు సంబంధించి మరింత మందిని గుర్తించి చర్యలు చేపడతామని చెప్పారు. నిందితులు అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాలకు చెందిన వారని చెంగంచెర్రి డీఎస్పీ ఆర్ శ్రీకుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంపన్న వర్గాలకు చెందిన వారు ఈ రాకెట్లో ఉన్నారని వెల్లడించారు. మరో 25 మంది అనుమానితులపై నిఘా పెట్టామని రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్ట్లు ఉంటాయని చెప్పారు.