మైలార్దేవ్పల్లి: వ్యక్తి అదృశ్యం అయిన సంఘటన మైలారేదేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉడంగడ్డ ప్రాంతానికి చెందిన సభావత్ లింగాయత్ (40) లేబర్ పని చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఇంటి నుండి వెళ్లిన వ్యక్తి రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో బందువులను ,స్నేహితులను ఆరా తీసిన ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.