ఖమ్మం : దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లాలో బాణాసంచా దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం లోపు సంబంధిత పత్రాలతో సీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే బాణా సంచా దుకాణాలలో వ్యాపారులు నియమనిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసు, నగరపాలక, అగ్నిమాపక శాఖలు నిర్ధేశించిన ప్రదేశంలో మాత్రమే అనుమతితో దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
బాణాసంచా విక్రయించే వ్యాపారులతో పాటు, టపాకాయలు కాల్చే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలనిపేర్కొన్నారు. ధరఖాస్తుతో పాటు ఎఈ -5 ఫామ్, సెల్ప్ అఫిడవిట్, చలానా రిసిప్ట్, ఆధార్కార్డు, ఫోటో జతపరచి పోలీసు కమిషనర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ చేసినా, తయారు చేసినా, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణాసంచా విక్రయదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.