పాట్నా: బీహార్లో హోలీ రోజున దారుణం జరిగింది. 8 ఏండ్ల బాలికపై సామూహిక లైంగిక దాడి జరిపి హత్య చేశారు. దీనిపై స్థానికులు నిరసనకు దిగారు. బంకా జిల్లాలో ఈ దారుణం జరిగింది. హోలీ రోజున ఎనిమిదేండ్ల బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. కాగా, మురుగు కాల్వలో పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో బాలిక హత్యపై నిరసనకు దిగారు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు బెల్హార్ పోలీస్ అధికారి ప్రేమ్ చంద్ర సింగ్ తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.