పట్నా: బిహార్ రాజధాని పట్నాలో దారుణం వెలుగుచూసింది. భార్య, కూతురిని హత్య చేసిన వ్యక్తి ఆపై తనకు తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గర్ధని బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా బాధితుడిని రాజీవ్గా గుర్తించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
కుటుంబ గొడవల కారణంగానే బాధితుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. మొదటి భార్య మరణించడంతో రాజీవ్ భార్య సోదరినే వివాహం చేసుకున్నాడు. అయితే రెండో భార్యతో రాజీవ్ తరచూ గొడవ పడుతుండేవాడు. ఇద్దరి మధ్య ఘర్షణలే హత్యలకు దారితీశాయని అనుమానిస్తున్నారు.