చెన్నై : చర్చిలో ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన పాస్టర్ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లా రామేశ్వరంలో వెలుగుచూసింది. బాలికలను వేధించిన చర్చి పాస్టర్ను జాన్ రాబర్ట్గా గుర్తించారు. రామేశ్వరంలోని మండపం ప్రాంతంలోని పునితర్ అరుల్ అనందర్ చర్చ్లో రాబర్ట్ పనిచేస్తున్నాడు.
లైంగిక వేధింపులకు గురైన బాధితులు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు సమాచారం అందించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. అధికారులు పాస్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు జాన్ రాబర్ట్ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.