ఖమ్మం :ఖమ్మంలో నాలుగు లక్షల నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్సు పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో నిందితున్ని అప్పగించారు. ఖమ్మంలోని ప్రకాష్ నగర్కు చెందిన కొదుమూరు బ్రహ్మం అనే వ్యక్తి తన నివాసంలో గుట్కా ప్యాకెట్లను నిల్వ చేసినట్లు పక్కా సమాచారం అందడంతో ఈ మేరకు టాస్క్ ఫోర్సు పోలీసులు అతని ఇంటిపై దాడులు నిర్వహించి నాలుగు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు కొదుమూరు బహ్మంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ సీఐ పి.సర్వయ్య తెలిపారు.