జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలకు ఓ వ్యక్తి బలయ్యాడు. ప్రత్యర్థులు తల్వార్తో విచక్షణారహితంగా నరికి చంపడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన ఇరిశెట్టి రాజేష్(30) అనే యువకుడు పొలానికి నీళ్లు పెట్టేందుకు బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో మాటు వేసిన ప్రత్యర్థులు తల్వార్తో దాడి చేయడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల కథనం మేరకు..భూ తగాదలే రాజేష్ను బలితీసుకున్నాయని చెబుతున్నారు. గతంలో భూమి గెట్టు విషయంలో గొడవడి రాజేష్ గంగారెడ్డి అనే వ్యక్తిని హత్య చేశాడని, ఇప్పుడు అతడి ప్రత్యర్థులు హత్య చేసి ఉంటారని తెలుస్తున్నది.
విషయం తెలుసుకున్న రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్ఐ అనిల్ ఘటనస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య కొడుకు లత, కొడుకు, కూతురు ఉన్నారు.