సంగారెడ్డి జిల్లా: సెప్టిక్ట్యాంక్ క్లీన్చేస్తుండగా విషవాయువు వెలువడింది. దీంతో నలుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో జరిగింది.
ఇస్నాపూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఉన్న ఓ బిల్డింగ్లో నలుగురు కార్మికులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్నారు. ఒక్కసారిగా విషవాయువు వెలువడింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా దవాఖానకు తరలించారు.