న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి కారులో కూర్చొన్న వారిని టార్గెట్ చేసి కాల్పులు జరిపారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కిశోర్పూర్ సబ్జీ మండి యూనియన్ మాజీ చైర్మన్ అజయ్ చౌదరి, ఆయన సోదరుడు జశ్వంత్ కలిసి కారులో సుభాష్ నగర్కు శనివారం రాత్రి చేరుకున్నారు. అక్కడే మాటు వేసిన ఓ ఇద్దరు అగంతకులు.. అజయ్ చౌదరి కారుపై బుల్లెట్ల వర్షం కురిపించారు. సుమారు 10 నుంచి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో చౌదరితో పాటు జశ్వంత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సుభాష్ నగర్ చేరుకుని, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#UPDATE | One more accused arrested in connection with the firing incident in Delhi’s Subhash Nagar area: Delhi Police https://t.co/kmbZLoMGR0
— ANI (@ANI) May 10, 2022