Shamshabad Airport | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు( Customs Officials ) సీజ్ చేశారు. దుబాయ్( Dubai ) నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. 66.47 లక్షల విలువ చేసే 1.40 కిలోల బంగారాన్ని( Gold ) స్వాధీనం చేసుకున్న అధికారులు తెలిపారు.
తున చేప ఆయిల్ డబ్బాల్లో బంగారు తీసుకొచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. మరో ప్రయాణికుడు పేస్ట్ రూపంలో బంగారం తీసుకొచ్చాడు. బంగారం తరలించిన ఇద్దరు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసులకు( Shmashabad Police ) అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.