ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలడంతో ఓ వ్యక్తి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని కార్మికులు నిన్న సగం కూల్చివేశారు. కాగా, బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెనపై పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలడంతో వారిద్దరు శిథిలాల్లో చిక్కుకుపోయారు. దీంతో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుడు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..