కర్నూలు : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి కిందపడగానే వేట కొడవళ్లతో నరికి హతమార్చారు. గడివేముల మండలం పెసరవాయి వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. పెసరవాయి మాజీ సర్పంచ్ వడ్డు నాగేశ్వర్ రెడ్డి అతడి సోదరుడు సహకార సంఘం మాజీ అధ్యక్షుడు వడ్డు ప్రతాప్ రెడ్డి ఉదయం శ్మశాన వాటికకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరిని ప్రత్యర్థులు వాహనంతో ఢీకొట్టి చంపారు. మృతులిద్దరూ టీడీపీకి చెందిన నాయకులని సమాచారం. వైసీపీ నాయకులే తమ వారిని హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే ఘటనలో వడ్డు సుబ్బారెడ్డి, వడ్డు వెంకటేశ్వర్లు అనే మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.