ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణ ఘటన వెలుగుచూసింది. 18 ఏండ్ల నర్సింగ్ విద్యార్ధినిని మంగళవారం మద్యాహ్నం ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై కేసు నమోదైంది.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే హింజెవాది పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఒకరు తనను సిగరెట్తో కాల్చాడని, ఇద్దరు నిందితులను ఇనుప గరిటెతో ప్రతిఘటించానని బాధితురాలు తెలిపారు.
ఈ క్రమంలో తన ఎడమ చేతికి కాలిన గాయాలయ్యాయని పిర్యాదులో పేర్కొన్నారు. మరో ఇద్దరు మహిళలతో కలిసి పేయింగ్ గెస్ట్గా ఉంటున్న మహిళ రూంలోనే నిందితులు బాధితురాలిపై నేరానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.