ఢిల్లీ : హైటెక్ రేంజ్లో కాలేజీ విద్యార్ధులకు డ్రగ్స్ చేరవేస్తున్న గ్యాంగ్ గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 25 లక్షల విలువైన దేశీ, విదేశీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ లీడర్ అక్షయ్ కుమార్ నోయిడాలోని కాలేజీలు, యూనివర్సిటీ విద్యార్ధులకు డ్రగ్స్ చేరవేసేవాడు.
తైవాన్లో పనిచేస్తున్న భార్య ద్వారా అతడు డ్రగ్స్ను సేకరించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ముఠాలో మరో సభ్యుడు రాజస్ధాన్కు చెందిన నరేంద్ర కాలేజ్ క్యాంపస్ల్లో, పేయింగ్ గెస్ట్లుగా ఉండే విద్యార్ధులను టార్గెట్గా చేసుకుని డ్రగ్స్ విక్రయిస్తాడు. స్నాప్చాట్, టెలిగ్రాం, వాట్సాప్ ద్వారా చిన్న పార్సిల్స్లో డ్రగ్స్ను ఈ ముఠా చేరవేస్తుందని పోలీసులు తెలిపారు.
ఈ చిన్న పార్సిల్ను రూ. 8000 వరకూ ఈ ముఠా చార్జ్ చేస్తుందని చెప్పారు. ఈ కేసులో నోయిడాలోని అమిటీ యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్ధులను కూడా అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్పై ఉక్కుపాదం మోపిన పోలీసులు పలు విద్యా సంస్ధలు, యూనివర్సిటీలపై చేపట్టిన దాడుల్లో పలువురు డ్రగ్ సరఫరాదారులను అరెస్ట్ చేశారు.
Read More :
Kantara Chapter 1 | లెజెండ్ వచ్చేసాడు.. ‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్