ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెద్దమొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో 3.950 కిలోల ఎఫిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. మత్తుమందును మహిళల దుస్తుల్లో అమర్చి పార్సిల్ తయారీ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఎఫిడ్రిన్ను ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.