న్యూఢిల్లీ : ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన వ్యాపారి, రెస్టారెంట్ల అధినేత నవనీత్ కల్రాపై ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. కల్రా అనుచరులను సైతం ఈ కేసులో ఈడీ బుక్ చేసింది. కల్రాపై మే 5న ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసింది.
ఢిల్లీలో ఇటీవల కల్రాకు చెందిన ఖాన్ చచా, నెగా జు, టౌన్ హాల్ రెస్టారెంట్లపై పోలీసులు జరిపిన దాడుల్లో 500 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణల కోణంలో కల్రా ఆయన అనుచరులపై ఈడీ దర్యాప్తు చేపట్టనుంది. మనీల్యాండరింగ్ చట్టం కింద నిందితుడిని విచారించి ఆయన స్టేట్ మెంట్ ను నమోదు చేయడంతో పాటు కల్రాపై ఈడీ చార్జిషీట్ ను దాఖలు చేయనుంది.