లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మీరట్ జిల్లాలోని బోధనాస్పత్రిలో మహిళా మానసిక రోగిపై అక్కడ పనిచేసే పారిశుద్ధ్య కార్మికుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడిని మీరట్ మెడికల్ కాలేజ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
మహిళ మానసిక పరిస్ధితి సజావుగా లేకపోవడంతో తల్లితండ్రులు 2017లో ఆమెను దవాఖానలో విడిచిపెట్టి వెళ్లారు. నిందితుడు దవాఖానలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ గురువారం ఈ దారుణానికి ఒడిగట్టాడు. లైంగిక దాడి ఘటన సమాచారం తెలియగానే నిందితుడిని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని మీరట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జ్ఞానేంద్ర వెల్లడించారు.