ముంబై : దేశ ఆర్ధిక, వినోద రాజధాని ముంబైలో డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. క్రూయిజ్ రేవ్ పార్టీ ప్రకంపనలు కొనసాగుతుండగానే ముంబై పోలీసులు నగరంలో మరో డ్రగ్ దందా గుట్టురట్టు చేశారు. యాంటీ నార్కోటిక్స్ సెల్ సహకారంతో ముంబై పోలీసులు జరిపిన దాడుల్లో రూ 15 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక క్రూయిజ్ పార్టీపై ఎన్సీబీ అధికారులు కూపీ లాగుతున్నారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన అధికారులు అదే షిప్పై జరిపిన తాజా దాడుల్లో మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.