భోపాల్ : మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ కోడలు షాజపూర్లోని మంత్రి పూర్వీకుల నివాసంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మంగళవారం ఈ ఘటన జరగ్గా మృతురాలిని సవితా పర్మార్ (23)గా గుర్తించారు.
మూడేండ్ల కిందట సవితా పర్మార్కు మంత్రి కుమారుడు దేవ్రాజ్ పర్మార్తో వివాహమైంది. ఆత్మహత్య కేసు నమోదు చేసిన పోలీసులు సవితా బలవన్మరణానికి కారణాలేంటనే దిశగా దర్యాప్తు చేపట్టారు. మంత్రి కోడలి విషాదాంతం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.