కామారెడ్డి : కామారెడ్డిలో తల్లీకుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఉన్న న్యూ మహారాజా లాడ్జిలో గదిలో తల్లీకుమారుడు నిప్పంటించుకున్నారు. గది నుంచి తెల్లవారుజామున పొగలు రావడంతో సిబ్బంది గమనించారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
మృతులను రామాయంపేట్కు చెందిన పద్మ, సంతోష్(35)గా పోలీసులు గుర్తించారు. తల్లి వైద్యం కోసం ఈ నెల 11న లాడ్జికి వచ్చినట్లు సమాచారం. ఘటనాస్థలిని డీఎస్పీ సోమనాథం, సీఐ నరేశ్ పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.