సూర్యాపేట : తుంగతుర్తి మండలం కాశిపేట వద్ద శనివారం ఉదయం గోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న తల్లీకుమార్తె మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులంతా తుంగతుర్తి మండలం రావులపల్లికి చెందిన వారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.