లక్నో : యూపీలోని కౌశంబి జిల్లాలో పోలీసులు చేపట్టిన ఎన్కౌంటర్ అనంతరం హత్యాచార కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. ఎన్కౌంటర్లో నిందితుడు రాజేంద్ర సరోజ్ రెండు కాళ్లపై పోలీసులు కాల్పులు జరిపారు. మహిళను అపహరించి హత్యాచారానికి పాల్పడిన కేసులో సరోజ్ నిందితుడని పోలీసులు వెల్లడించారు.
రెండు రోజుల కిందట కరారిలోని పొలంలో బాధితురాలి మృతదేహం లభించింది. నిందితుడి కదలికలపై సమాచారం అందడంతో కరారి పోలీస్ స్టేషన్ సమీపంలో ఎన్కౌంటర్ జరిగింది. నిందితుడు సరోజ్ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.