Karimnagar | ఇది హృదయ విదారక ఘటన.. తండ్రేమో గుండెపోటు( Heart Stroke )తో చనిపోయాడు. తల్లేమో రోడ్డుప్రమాదం( Road Accident )లో దుర్మరణం చెందింది. బంగారం లాంటి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. తండ్రి తొమ్మిదేండ్ల క్రితం చనిపోగా, మోడల్ స్కూల్లో టీచర్గా పని చేస్తున్న తల్లి శుక్రవారం రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఇద్దరు మగ పిల్లలు గుండెలవిసేలా ఏడ్చిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా( Karimnagar Dist ) కేంద్రంలోని అలాపూర్ కాలనీకి చెందిన బైరెడ్డి రజిత( Bireddy rajitha ) రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట మోడల్ స్కూల్( Model School )లో గణిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఒంటిపూట బడులు కావడంతో ఉదయం ఆరున్నర గంటలకు ఇంటి నుంచి స్కూటీ( Scooty )పై స్కూల్కు బయల్దేరింది. కరీంనగర్ – సిరిసిల్ల బైపాస్ రహదారి గుండా వస్తుండగా పద్మనగర్ వద్ద ఎదురుగా వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. స్కూటీని ఢీ కొట్టింది. స్కూటీతో పాటు రజితను లారీ కొంచెం దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఆమె శరీరమంతా నుజ్జునుజ్జు అయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్థానికులు అక్కడి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కాంక్రీట్ మిక్చర్ లారీ డ్రైవర్పై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌ న్ సీఐ లక్ష్మీ బాబు తెలిపారు. కాగా, తొమ్మిదేండ్ల క్రితం తండ్రి బైరెడ్డి తిరుపతిరెడ్డి గుండెపోటుతో మరణించాడు. నేడు తల్లి మరణంతో వారి కొడుకులు ప్రజ్ఞాన్రెడ్డి(15), రిషిక్ (11) అనాథలయ్యారు.