భువనేశ్వర్ : ఏటీఎం లూటీ ఘటనలకు బ్రేక్ పడటం లేదు. భువనేశ్వర్లో మంగళవారం తెల్లవారుజామున ఇందిరా కాలనీలోని ఏటీఎంను దుండగులు గ్యాస్కట్టర్తో పగులగొట్టి టెల్లర్ మెషిన్ను ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. మెషీన్లోని నగదు అంతా దోచుకున్న దుండగులు ఆపై భువనేశ్వర్ శివార్లలోని నిర్జన ప్రదేశంలో మెషీన్ను పడవేసి పరారయ్యారు.
సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ముఖాలకు మాస్క్లు వేసుకున్న దుండుగులు ఏటీఎం కియోస్క్లోకి ప్రవేశించి తొలుత అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆపై గ్యాస్ కట్టర్తో ఏటీఎంను బద్దలు కొట్టారు. ఆపై మూడు క్వింటాళ్ల బరువుండే క్యాష్ టెల్లర్ మెషీన్ను ఎత్తుకెళ్లారు.
ఏటీఎంలో ఆ సమయంలో రూ 20 లక్షల నగదు ఉందని చెబుతున్నారు. దుండగులు నగదును తీసుకున్న అనంతరం హౌసింగ్ బోర్డు సమీపంలోని నిర్జన ప్రదేశంలో ఏటీఎం మెషీన్ను పడేశారు. ఏటీఎం చోరీ విషయం తెలియడంతో ధౌలి పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. దుండగులను గుర్తించేందుకు పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.