పట్నా : పదేండ్ల బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాజధాని పట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో తమకు ఈ విషయం తెలిసిందని బాధితురాలి కుటుంబసభ్యులు తెలిపారు. రాజీవ్ నగర్ పోలీస్స్టేషన్లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లితండ్రులు పని కోసం బయటకు వెళ్లడంతో ఇదే అదనుగా పొరుగింట్లో ఉండే నిందితుడు ఆమె ఇంట్లోకి చొరబడి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బాలికను నిందితుడు బెదిరించాడు. బాలికకు వైద్య పరీక్షలు జరపగా ఆమె లైంగిక దాడికి గురైందని వైద్యులు నిర్ధారించారు. బాలిక స్టేట్మెంట్ను నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు.