మధుర : వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో దళిత బాలికను అపహరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. మధుర జిల్లా కొసికలన్ ప్రాంతానికి చెందిన బాధిత బాలికను తల్లి కాపాడి నిందితుల చెర నుంచి విడిపించిందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికపై ఢిల్లీలో పలుమార్లు నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన ప్రతిసారీ ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు. బాధితురాలు ఎలాగోలా తల్లికి విషయం చేరవేయడంతో ఆమె నిందితుల చెరనుంచి బాలికను విడిపించింది. ముగ్గురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని మధుర రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర వెల్లడించారు.