యమదొంగ ఫేం, మలయాళ నటి మమతా మోహన్ దాస్ తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. కెరీర్ మొదట్లో క్యాన్సర్ని జయించి తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. గత రాత్రి తన ఇన్స్టాగ్రామ్లో హారక్లీ డేవిడ్ సన్ బైక్ని నడుపుతున్న వీడియోని షేర్ చేసింది. 15 ఏళ్ల తర్వాత మళ్లీ రైడ్ చేసానంటూ తన వీడియోలో పేర్కొంది.
వీడియోలో మమత చాలా స్టైలిష్ అండ్ కూల్ లుక్లో కనిపిస్తుంది. ఈ అమ్మడిని చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ప్రస్తుతం తెలుగు – తమిళం- మలయాళ ట్రైలింగ్యువల్ చిత్రం లాల్బాగ్లో మమతా మోహన్ దాస్ నటిస్తుంది. దశాబ్ధం తర్వాత ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది ఈ ముద్దుగుమ్మ.