సంగారెడ్డి : పాముకాటుతో వలస కూలీ మృతిచెందిన విషాదకర సంఘటన హత్నూర మండలం బోర్పట్లలో ఆదివారం చోటుచేసుకుంది. హత్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా యమ్మిగనూరు మండలం కందినాలి గ్రామానికిచెందిన హజ్రత్బీ (48) తన కుటుంబ సభ్యులతో కలిసి గతనెల క్రితం బోర్పట్ల గ్రామానికి పత్తి తీసేందుకు పనికి వచ్చారు.
శనివారం గ్రామానికిచెందిన న్యారటి రాజిరెడ్డి పొలంలో పత్తి తీస్తుండగా పాము కాటువేసింది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారం జామున మృతిచెందింది. మృతురాలు భర్త రాయచూర్ జమీర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Snake bite | తండ్రీ బిడ్డలను కాటేసిన పాము..చిన్నారి మృతి
రైతుల పట్ల కేంద్రం మొండి వైఖరి : మంత్రి ఐకే రెడ్డి
యాదాద్రికి పోటెత్తిన భక్తులు..