గురుగ్రాం : బాలికతో మాట్లాడుతున్నాడని యువకుడి (20)ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించిన ఘటన సోహ్నా ప్రాంతంలో వెలుగుచూసింది. బాధితుడు సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడిని సోహ్నాలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే సాహిల్గా గుర్తించారు.
సాహిల్ ఆస్పత్రి నుంచి తిరిగి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు అతడిని కారులోకి లాగి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. అక్కడ అతడిని దారుణంగా హింసించి అతడి వద్ద ఉన్న రూ 2000ను గుంజుకున్నారు. తన సహోద్యోగి ప్రీతితో మాట్లాడితే చంపేస్తామని వారు హెచ్చరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సాహిల్ పేర్కొన్నాడు.
ఇక పాలం విహార్లోని మరో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లిన నిందితులు తనపై దాడి చేసి తన మొబైల్ పోన్ను లాక్కున్నారని ఆరోపించాడు. నిందితులను రాహుల్, నరేష్గా గుర్తించిన పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.