జైపూర్: డ్యాన్స్ ఫ్లోర్కు అనుమతించనందుకు మెడికల్ విద్యార్థులు ఒక రెస్టారెంట్ను ధ్వంసం చేశారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అజ్మీర్లోని జైపూర్ రోడ్డులో ఉన్న ‘మిర్చ్ మసాలా’ రెస్టారెంట్కు శనివారం రాత్రి సుమారు 15 మంది మెడికల్ విద్యార్థులు వచ్చారు. డ్యాన్స్ ఫ్లోర్కు తమను అనుమతించాలని, డీజే ప్లే చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే కరోనా మార్గదర్శకాల మేరకు ఇది కుదరదని రెస్టారెంట్ సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు సిబ్బందితో ఘర్షణకు దిగారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 11 గంటలకు 100-150 మంది వైద్య విద్యార్థులు రాడ్లు, హాకీ స్టిక్స్తో ఆ రెస్టారెంట్ వద్దకు చేరుకుని విధ్వంసం సృష్టించారు. రెస్టారెంట్లోని టేబుళ్లు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.