హైదరాబాద్ : వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబండ పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన ఇస్మాయిల్.. ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. వీడియోలు బయటపెడుతామని మహిళను బెదిరింపులకు గురి చేశాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని ఆమెపై ఇస్మాయిల్, యాసిన్ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు.
పదేపదే బెదిరిస్తుండటంతో బాధితురాలు విసిగిపోయింది. తన ప్రియుడు వెంకట్తో కలిసి వికారాబాద్కు వెళ్లి.. అక్కడ పురుగుల మందు సేవించారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆ జంటను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత వారిద్దరూ కోలుకున్నారు. అనంతరం ఆ జంటను పోలీసులు ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పారు. దీంతో బోరబండకు చెందిన ఇస్మాయిల్, యాసిన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.