రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వైష్ణవి అనే వివాహిత ఇంట్లో కరెంట్ హీటర్ పెడుతుండగా విద్యుత్ఘాతానికి గురై చనిపోయింది. మృతిరాలికి భర్త దినకర్, ఇద్దరు కొడుకులు దీపాన్స్(5), హిమాన్స్(3) ఉన్నారు. బట్టలు ఉతుకుదామని బాత్రూమ్ లోకి వెళ్ళిన వైష్ణవి అక్కడే ఉన్న హీటర్ తీసే సమయంలో హీటర్ కాళ్లపై పడి కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.