Vinayak Mete | మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ సభ్యుడు, శివసంగ్రామ్ పార్టీ నేత వినాయక్ మేటే (52) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముంబై – పుణే ఎక్స్ప్రెస్పై ఆదివారం జరిగిన ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పో్యారు. రాయగఢ్ జిల్లాలోని రసాయని పోలీస్ స్టేషన్ పరిధిలోని మదప్ టన్నెల్ సమీపంలో ఉదయం 5.15 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. మేటే మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల కోసం మద్దతిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మేటే పుణె నుంచి ముంబయికి సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు.
ఆయనతో పాటు కారులో మరో వ్యక్తి, డ్రైవర్ ఉన్నారు. కారును మడప్ టన్నెల్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న వాహనం ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో అందరు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. వారందరినీ నవీ ముంబైలోని కమోతేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. వినాయక్ మేటే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరఠ్వాడా ప్రాంతంలోని బీడ్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా.. ఆయన మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్ల కోసం కృషి చేస్తున్నారు.