అహ్మదాబాద్ : తనను ప్రేమించేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో 21 ఏండ్ల మహిళను హత్య చేసిన ఫెనిల్ గొయానీకి సూరత్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో పదిరోజుల్లో 2500 పేజీల చార్జిషీట్ నమోదవగా దోషికి 70 రోజుల్లో మరణశిక్ష ఖరారైంది.
సూరత్లోని పసోదరలో ఫిబ్రవరి 12న ఈ హత్య జరిగింది. తన ఇష్టాన్ని కాదనిందనే కోపంతో ఫెనిల్ బాధితురాలు గ్రీష్మ గొంతు కోశాడు. గ్రీష్మను కాపాడేందుకు ముందుకొచ్చిన ఆమె సోదరుడు, అంకుల్పైనా ఫెనిల్ దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి గుజరాత్లో శాంతి భద్రతల పరిస్ధితిపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. గ్రీష్మను హత్య చేసిన తర్వాత ఫెనిల్ బలవన్మరణానికి ప్రయత్నించాడు.
గాయపడిన ఫెనిల్ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించి ఆపై డిశ్చార్జి చేశారు. హత్యకు ముందు ఫెనిల్ గ్రీష్మను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు దూరంగా ఉండాలని గ్రీష్మ కుటుంబ సభ్యులు పలుమార్లు అతడిని హెచ్చరించారు. గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి గ్రీష్మ ఇంటికి చేరుకుని వారికి న్యాయం చేస్తామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.