ముంబై : ఆన్లైన్లో పార్ట్టైం జాబ్ చేస్తూ (Cyber Fraud) అదనపు ఆదాయం ఆర్జించాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు స్కామర్లు ఆన్లైన్ వేదికగా అమాయకులను దోచేస్తున్నారు. ఈజీ మనీ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తూ సైబర్ స్కామర్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా నవీ ముంబైకి చెందిన వ్యక్తికి వర్క్ ఫ్రం హోం ఆఫర్ పేరుతో రూ. 20 లక్షలకు పైగా టోకరా వేశారు. వాట్సాప్, టెలిగ్రాం వేదికగా బాధితుడిని సంప్రదించిన స్కామర్లు ఆకర్షణీయ రిటన్స్ అందించే ఆన్లైన్ జాబ్ను ఆఫర్ చేశారు. తొలుత కొన్ని టాస్క్లు పూర్తిచేయగా వాటికి మెరుగైన రిటన్స్ ఇవ్వడంతో స్కామర్లను బాధితుడు నమ్మాడు.
ఆపై నిందితులు సూచించిన వివిధ ఖాతాల్లోకి రూ. 20.22 లక్షలు బదిలీ చేశాడు. తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా నిందితులు తప్పించుకునే ధోరణితో వ్యవహరించడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీ ముంబై పోలీసులు కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
Read More :