ముంబై : తనతో సన్నిహిత సంబంధం నెరిపేందుకు వదిన నిరాకరించడంతో ఆమెపై టాయ్లెట్ శుభ్రం చేసే రసాయనంతో దాడిచేసిన ప్రబుద్ధుడి ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. భర్త మరణించడంతో ఒంటరిగా నివసిస్తున్న వదినపై కన్నేసిన అప్పటికే వివాహితుడైన నిందితుడు ప్రభుద్ కాంబ్లే (45) తనను పెండ్లి చేసుకోవాలని పలుమార్లు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న నిందితుడు నేరుగా ఘట్కోపర్లో మహిళ పనిచేస్తున్న నగల దుకాణానికి వెళ్లి ఆమెపై టాయ్లెట్ క్లీనర్ను పోశాడు. ఆమెకు ఉద్యోగం ఇచ్చిన షాపు యజమానిపై సైతం ఆగ్రహంతో రగిలిన నిందితుడు మహిళ సహోద్యోగులు ఇద్దరిపైనా దాడి చేశాడు. గాయపడిన బాధితురాలు సహా గాయాలైన ముగ్గురిని దవాఖానకు తరలించామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.