లక్నో : భార్య ప్రియుడిని తండ్రి సహకారంతో ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన యూపీలోని సీతాపూర్లో వెలుగుచూసింది. గత కొద్దిరోజులుగా నిందితుడి భార్య రాత్రి పొద్దుపోయిన తర్వాత ఫోన్లో గంటలతరబడి మాట్లాడుతోంది. తరచూ ఇంటి నుంచి బయటకి వెళ్లి ఎంతకూ తిరిగిరాకపోవడంతో భార్య ప్రవర్తనపై నిందితుడికి అనుమానం కలిగింది. ఓరోజు మోహిత్ అనే వ్యక్తితో అభ్యంతరకర స్ధితిలో ఆమె భర్తకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడింది.
దీనిపై భార్యను హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్య పరాయి మగాడితో తిరుగుతోందని బంధువులు, కుటుంబసభ్యులు చెప్పుకుంటుండటంతో నిందితుడు ఆగ్రహంతో రగిలిపోయాడు. తండ్రితో కలిసి మోహిత్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మోహిత్కు ఫోన్ చేసి తనతో మాట్లాడాలని అతడిని గోలాపూర్-సీతాపూర్ ప్రాంతానికి రప్పించి పదునైన ఆయుధంతో గొంతు కోసి హత్య చేశారు. హత్య కేసులో పోలీసులు తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.