ఘజియాబాద్ : టీ విషయంలో భార్యతో జరిగిన ఘర్షణలో విచక్షణ కోల్పోయిన వ్యక్తి భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటన (Man Stabs Wife) ఘజియాబాద్లో కలకలం రేపింది. కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం నిందితుడిని అరస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో టీ తయారుచేసే విషయంలో ధరంవీర్కు భార్య సుందరి (50)తో వాదన జరిగింది. ఆపై వాదన ఘర్షణకు దారితీయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ధరంవీర్ ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో భార్యపై పలుమార్లు దాడిచేశాడు.
ఘటనా స్ధలంలోనే భార్య కన్నుమూయడంతో ధరంవీర్ పరారయ్యాడు. మహిళ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధరంవీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భారత్ కారణం కాదు: నవాజ్ షరీఫ్