భోపాల్: అంతా చూస్తుండగా పోలీస్ నుంచి లాఠీ లాక్కొన్న ఒక వ్యక్తి ఆయనను చితకబాదాడు. వెంబడించి మరీ పలుసార్లు కొట్టాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది. వెంకటేష్ నగర్ ప్రాంతంలో శుక్రవారం 25 ఏండ్ల దినేష్ ప్రజాపతి, పోలీస్ కానిస్టేబుల్ జై ప్రకాష్ జైస్వాల్ బైకులు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో వారిద్దరూ కిందపడ్డారు. అయితే ఈ ప్రమాదంపై ఆగ్రహించిన దినేష్, కానిస్టేబుల్ జైస్వాల్ నుంచి లాఠీ లాక్కొని ఆయనపై దాడి చేశాడు. పైకి లేచి వెళ్తున్న ఆయనను వెంబడించి మరీ పలుమార్లు చితకబాదాడు. పోలీస్ తలపై కూడా లాఠీతో కొట్టాడు. అక్కడున్న వారు చోద్యం చూశారే తప్ప ఎవరూ కూడా కానిస్టేబుల్ రక్షణకు ముందుకు రాలేదు.
కాగా, ఈ ఘటనలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జై ప్రకాష్ జైస్వాల్ దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దినేష్ ప్రజాపతిని అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కొందరు స్థానికులు మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq
— Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022