చాలాకాలంగా ఒక యువతి వెంట పడుతున్నాడా యువకుడు. సడెన్గా ఒక రోజు వచ్చి ఆమె పక్కనే బైక్ ఆపాడు. ఆఫీసుకు వెళ్తున్న ఆమెను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించాడు. ఆ యువతి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో కోపం తెచ్చుకున్న ఆ యువకుడు.. తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఈ ఘటన గురుగ్రామ్లో వెలుగు చూసింది.
19 ఏళ్ల సదరు యువతిపై కాల్పులు జరిపిన వ్యక్తిని అభయ్ శర్మ అని పోలీసులు గుర్తించారు. స్కూల్ టైం నుంచి ఆమెను అభయ్ ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఆమెకు తెలియదు. శనివారం నాడు సడెన్గా ఆమె పక్కన బైక్ ఆపిన అభయ్.. ఆమెను బలవంతంగా తన వెంట తీసుకెళ్లాలని అనుకున్నాడు.
ఆమె నిరాకరించడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఆమె మెడకు గాయం చేసింది. దీంతో ఆమె అక్కడే పడిపోయింది. అది చూసిన అభయ్.. రోడ్డుపై వస్తున్న మరో వ్యక్తిని బెదిరించి అతని బైక్పై అక్కడి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని అక్కడే ఉన్న అభయ్ మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు.
బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా.. కోలుకున్న ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.