ఇండోర్: దీపావళి రోజు పటాకులు కాల్చబోతుంటే అడ్డుకున్నాడనే కోపంతో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడో వ్యక్తి. ఇంటి ఎదురుగా ఉండే పొరుగింటి వ్యక్తి కారును పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుశ్వాహ నగర్లో నివసించే మనీష్ మౌర్యకు ఒక కారుంది.
దీపావళి రోజును పొరుగింటి రవి రాజ్పుత్.. పటాకులు కాల్చబోతుంటే అతను అడ్డుకున్నాడు. తన కారుకు సమీపంలో పటాకులు పేల్చొద్దని వారించాడు. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న రవి.. అర్ధరాత్రికి తిరిగొచ్చాడు. తన స్నేహితుడు సాగర్తో కలిసి వచ్చి మనీష్ కారుపై పెట్రోలు పోసి తగలబెట్టాడు.
అతను చేసిన ఘనకార్యం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయింది. దీని ఆధారంగా కేసు బుక్ చేసిన పోలీసు అధికారులు రవిని అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన సాగర్పై కేసు నమోదు చేసి గాలింపుచర్యలు చేపట్టారు.