ముంబై : డిఫెన్స్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ పలువురిని మోసం చేసిన వ్యక్తిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ ఆర్టిలరీ సెంటర్లో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తనకు తాను ఆర్మీ అధికారిగా చెప్పుకుంటూ నిందితుడు నిరుద్యోగులను మోసం చేశాడు.
తాను హర్యానాలోని ఆర్టిలరీ ఫార్మేషన్లో పనిచేసే మేజర్ గణేష్ పవార్గా నిందితుడు చెప్పుకున్నాడు. ఆర్మీ యూనిఫాంలో నాసిక్లోని డియోలాలి వద్ద తిరుగుతున్న మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సర్వీస్ సర్టిఫికెట్, కండక్ట్ సర్టిఫికెట్, ఫాం 16 వంటి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాలతో నిందితుడు నాసిక్లోని ఓ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆర్మీలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి నిందితుడు రూ 3 లక్షలు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. ఆర్మీలో జాబ్ల పేరుతో పలువురి నుంచి నిందితుడు పెద్దమొత్తంలో వసూలు చేశాడని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది.