ఫేస్బుక్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం అంటే నేటి యువతకు ఒక సరదా. కాన చాటింగ్ చేస్తూ అందులో వచ్చిన ఒక యాడ్పై క్లిక్ చేసి లక్షలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. అదెలాగంటే..
ఢిల్లీలోని దాబ్డీ ప్రాంతాపరి రాజా సింగ్ అనే యువకుడు రోజూ లాగే ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ అందులో ఒక యాడ్ క్లికి్ చేశాడు. ఆ తరువాత నుంచి అతనికి రోజూ ఫోన్ కాల్స్ వచ్చేవి. అలా ఫోన్ చేసిన వారు .. “బజాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పది లక్షల లోన్ ఇప్పిస్తాం.. అది కూడా తక్కువ వడ్డీతో.. వెంటనే తీసుకోండి.. ష్యూర్టీ కూడా మేమే చూసుకుంటాం.. త్వరపడండి” అంటూ రాజా సింగ్ను బురిడీ కొట్టించారు.
వేర్వేరు నెంబర్లతో అతడికి రోజూ కాలే వచ్చేసరికి రాజా సింగ్ లోన్ తీసుకుందాం అని నిర్ణయించుకొని.. వారికి కాల్ చేశాడు. అప్పుడు ఆ లోన్ ఇప్పిస్తామని చెప్పినవారు.. రాజాసింగ్ చేత కొ్న్ని డాక్యుమెంట్లు, కాన్సెల్ చేసిన చెక్లపై సైన్ చేయించుకున్నారు. ఆ తరువాత అతడికి రూ.10 లక్షలు లోన్ కావాలంటే ష్యూరిటి ఇచ్చేవారికి కొంచెం డబ్బులివ్వాలని, ఇప్పటికే లోన్ ప్రాసెసింగ్ మొదలైందని చెప్పారు. అది నమ్మిన రాజా సింగ్ వారికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ తరువాత అసలు కథ మొదలైంది.
రాజాసింగ్ లోన్ తీసేసుకున్నట్టు డాక్యుమెంట్లపై అతడి సైన్ తీసుకున్నామని.. వెంటనే రూ.10 లక్షల లోన్కు సంబంధించి నెలవారి ఇన్స్టాల్మెంట్లు కట్టమని.. లేకపోతే కేసు పెడతామని అతడిపై ఒత్తిడి చేసేవారు. దీంతో రాజాసింగ్ ఒక్కసారిగా ఉల్లికి పడ్డాడు. తాను మోసపోయాని తెలుసుకున్నాడు.
జైలు పంపిస్తారని భయపడి.. ఆ మోసగాళ్ల అకౌంట్లో రూ.3.11 లక్షలు డబ్బులు వేశాడు. ఇంకా డబ్బులు వేయమని రాజాసింగ్ను బ్లాక్ మెయిల్ చేస్తే.. చివరికి అతడు విసిగిపోయి స్నేహితుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జరిగినదంతా అక్కడ పోలీసులకు వివరించాడు. పోలీసులు ప్రస్తుతం చీటింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.