ముంబై: పక్కన పడుకోనివ్వలేదన్న కోపంతో భార్యను భర్త హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మలాడ్లోని మల్వానీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ల జ్ఞానదేవ్ గణపత్ బలదే శుక్రవారం రాత్రి 48 ఏళ్ల భార్య విజయమాలతో గొడవ పడ్డాడు. పక్కన పడుకోనివ్వని ఆమెతో ఘర్షణకు దిగాడు. వాగ్వాదం తీవ్రం కావడంతో ఆగ్రహంతో రాతి పలకతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో తలపగిలి రక్తం కారి ఆమె చనిపోయింది.
కాగా, ఈ సంఘటన అనంతరం జ్ఞానదేవ్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి సరెండర్ అయ్యాడు. పక్కన పడుకోనివ్వనందుకు తమ మధ్య ఘర్షణ జరిగిందని, రాతి పలకతో భార్య తలపై కొట్టి ఆమెను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. రక్తం మడుగుల్లో పడి చనిపోయిన భార్య విజయమాల మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన భర్తపై హత్య సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.